Montha Cyclone : ఇటీవల వచ్చిన మొంథా తుపాన్ రైతన్నలకు గుండెకోతను మిగిల్చింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ మొంథా తుపాన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పంట చేతికొచ్చింది అనుకునే లోపే తుపాను రావడంతో తెలంగాణలో ఉన్న వరి పంట మొత్తం నేలకొరిగింది. పంట నేలకొరిగిందని ఓ రైతు గుండెపోటుతో మృతి చెందగా, పంట దిగుబడి లేదని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన ఇజ్జయ్య అనే 65 సంవత్సరాల రైతు వర్షాలకు దెబ్బతిన్న తన పంటను చూసి తట్టుకోలేక పొలంలోనే గుండెపోటుతో మృతి చెందాడు.
మరోవైపు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడేనికి చెందిన ఉపేందర్ రెడ్డి అనే రైతు అప్పు తెచ్చి పంట వేశాడు. కాననీ, ఇటీవల కురిసిన వర్షానికి పంట మొత్తం నాశనం అవ్వడంతో అప్పు తీర్చే మార్గం లేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
