Advertisement

TG News: రైతులకు ఎకరానికి ₹9,600 సబ్సిడీ!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana) కూరగాయలు సాగు చేసే రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూరగాయల కొరతను నివారించి, సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి ₹9,600 చొప్పున సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది.

ఒక ఎకరా కూరగాయల సాగుకు సుమారు ₹24,000 ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, అందులో 40% (అనగా ₹9,600) నిధులను సబ్సిడీగా అందించనుంది. ఈ పథకం కింద ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అంటే, ఒక రైతు గరిష్టంగా ₹48,000 వరకు ఆర్థిక లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement