Advertisement

గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్..

నల్గొండ జిల్లా దేవరకొండ ( Devarakonda) ఎస్టీ బాలికల గురుకుల (ST Gurukula) పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థిని మాధవి ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కళ్యాణిని ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థినిపై ప్రిన్సిపల్ కళ్యాణి, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అమృతలు వేధింపులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తల్లి కళ మీడియా ఎదుట వాపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉపాధ్యాయులపై శాఖా పరమైన విచారణకు ఆదేశించారు

Advertisement
Advertisement