WhatsApp
Advertisement

Bus Accidents : నిన్న చేవెళ్ల.. ఇవాళ నల్గొండ, కరీంనగర్‌లో బస్సుల ప్రమాదాలు

Bus Accidents : చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ ను మరవక ముందే తెలంగాణలో మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి దగ్గర ఇవాళ ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను మెట్ పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు నల్గొండ జిల్లాలోని బుగ్గబావి గూడెం వద్ద ట్రాక్టర్ ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

Advertisement
Advertisement