మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్లో నవంబరు నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బియ్యం స్టాకును ఇప్పటికే రేషన్ షాపులకు తరలించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా పరిధిలో మొత్తం 7,98,269 రేషన్కార్డులు ఉండగా, 30,42,056 మంది లబ్దిదారులు ఉన్నారు. నవంబర్ నెలకు గాను 17,102 టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించారు. మొదటి విడతగా 8,500 టన్నుల బియ్యాన్ని నగరంలోని 653 రేషన్ షాపులకు పంపించారు. సన్న బియ్యంతో పాటు, జీహెచ్ఎంసీ పరిధిలో 3,400 టన్నుల గోధుమలను కూడా ఈ నెల పంపిణీ చేస్తున్నామని అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
