మన పత్రిక, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేశారు. బాధితుడు చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజుగా గుర్తించారు.
గుర్తు తెలియని శవమని భావించిన సిబ్బంది, రాజును రాత్రంతా మార్చురీలోనే ఉంచారు. ఉదయం ఓ స్వీపర్ గమనించి, రాజు బతికే ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని బయటకు తీసి తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆధార్ కార్డు లేదనే కారణంతోనే వైద్య సిబ్బంది అతడిని మొదట అడ్మిట్ చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
