మన పత్రిక, మిర్యాలగూడ: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారులుగా (ఏబీసీడీఓ) ఎంపికైన 16 మందికి శుక్రవారం సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వారిని సత్కరించి, అభినందనలు తెలిపారు. నూతన ఉద్యోగ ప్రయాణంలో భాగంగా, బీసీ సంక్షేమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆయన విజేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
