మన పత్రిక, వెబ్డెస్క్: మృతుడు మంకమ్మతోటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ( Doctor srinivas ) , గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. భర్త ఆత్మహత్యపై డాక్టర్ విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరుణాకర్, కిరణ్, గణేష్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్త ‘మెటా ఫండ్’లో డబ్బులు పెట్టారని, వారికి కోట్లలో డబ్బులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. వైద్యవృత్తిలో ఉండటంతో శ్రీనివాస్ పేరుపై బ్యాంక్ రుణాలు తీయించి, పలురకాల బిజినెస్లలో వారు డబ్బులు పెట్టించి మోసం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ మోసం కారణంగా శ్రీనివాస్కు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని బంధువులు తెలిపారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగులు తరచూ ఇంటికి రావడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని, స్నేహితులు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
