WhatsApp
Advertisement

Cyclone Montha : మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు

Cyclone Montha : ప్రస్తుతం ఏపీని మొంథా తుపాను వణికిస్తోంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల్లో మొంథా తుపాను ధాటికి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. భీకర గాలులు, భారీ వర్షాలకు ఏపీ అంతటా అతలాకుతలం అవుతోంది. కోస్తాంధ్రతో పాటు ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలంలోనూ భారీగా వర్షాలు, వరదలు రావడంతో భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

మరోవైపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement
Advertisement