Cyclone Montha : ప్రస్తుతం మొంథా తుఫాను వల్ల ఏపీ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ తుఫాన్ ధాటికి కోస్తా తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వెళ్లే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. దాదాపుగా 107 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు మూడు రోజులు రైళ్లను క్యాన్సిల్ చేశారు. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. ఏ రైళ్లు రద్దయ్యాయో వాటి వివరాలను రైల్వే శాఖకు సంబంధించిన వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు రైల్వే శాఖ సందేశాలను పంపించింది. అన్ని డివిజన్లకు సంబంధించిన రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
