Advertisement

Wines Tenders: ఒకే వ్యక్తికి 5 షాపులు!

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా మద్యం టెండర్లలో ఓ వ్యక్తిని భారీ అదృష్టం వరించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో చర్లపల్లికి చెందిన మాడుగుల నగేష్ అనే వ్యక్తి ఐదు షాపుల కోసం టెండర్లు దాఖలు చేశారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లాటరీ (లక్కీ డ్రా)లో ఆయన అదృష్టం తలుపు తట్టింది. తాను దరఖాస్తు చేసిన ఐదు షాపులకు గాను, ఐదింటినీ నగేష్ దక్కించుకున్నారు. ఒకే వ్యక్తికి ఐదు షాపులు దక్కడంతో ఆయన పట్టరాని ఆనందంలో మునిగిపోయారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement