మన పత్రిక, వెబ్డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో, నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు.
వీరిలో అత్యధికంగా బోరబండ ఏరియా నుంచి 74 మంది ఉండటం గమనార్హం. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, పోలీసులు బైండోవర్ చేసిన వారిలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన సోదరుడు రమేశ్ యాదవ్ కూడా ఉన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
