మన పత్రిక, వెబ్డెస్క్ : New Meeseva Centers in Rangareddy District. రంగారెడ్డి జిల్లాలో కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
Rangareddy Meeseva Centers Notification 2025
మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబడే మండలాలు:
Advertisement
- గండిపేట మండలం: వట్టినాగులపల్లి, గండిపేట, కిస్మత్ పూర్, గంధంగూడ
- మొయినాబాద్ మండలం: అజీజ్ నగర్, హిమాయత్ నగర్, కనకమామిడి
- చౌదరిగూడ మండలం: తుంపల్లి, ఎదిర
- సరూర్ నగర్ మండలం: తుమ్మబౌలి
- మంచాల మండలం: లోయపల్లి
దరఖాస్తు వివరాలు:
- దరఖాస్తు గడువు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 20, 2025 వరకు
- దరఖాస్తు ఫీజు: రూ.500/- (తిరిగి ఇవ్వనిది). డిడి జిల్లా కలెక్టర్ పేరు మీద తీసి, ఫారానికి జత చేయాలి.
అర్హతలు:
- అభ్యర్థి స్థానికుడు (ఆ మండలానికి చెందినవాడు) కావాలి.
- కనీస విద్యార్హత: డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ.
- కంప్యూటర్ పై సర్టిఫికెట్ తో పాటు సమగ్ర పరిజ్ఞానం ఉండాలి.
- వయస్సు: 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
- మీసేవ కేంద్రాన్ని నిర్వహించేందుకు సరైన పెట్టుబడి సదుపాయం ఉండాలి.
- నేర చరిత్ర లేని వారు మాత్రమే అర్హులు.
ఎంపిక ప్రక్రియ:
- అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
- పేదవారు, వికలాంగులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల యువతకు ప్రాధాన్యత ఇస్తారు.
మరింత సమాచారం కోసం: https://rangareddy.telangana.gov.in/notification-issued-for-new-meeseva-centers-in-rangareddy-district/
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
