మన పత్రిక, వెబ్డెస్క్: కరీంనగర్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం నగరంలోని కమాన్ ప్రాంతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా, భారీగా జరిమానాలు బకాయి ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గణేష్ నగర్కు చెందిన కట్కోజువాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి హోండా షైన్ (TS22 7090) బైక్పై రాంగ్ రూట్లో వస్తుండగా పట్టుబడ్డాడు.
Advertisement
వాహనాన్ని తనిఖీ చేయగా, దానిపై 120 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలింది. ఈ చలాన్ల మొత్తం విలువ రూ. 29,560గా గుర్తించారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, తదుపరి చర్యల కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
