మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పాలనాపరంగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ‘సర్వే అటవీ సరిహద్దుల సెటిల్మెంట్లు’ పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద పనిచేసే జాయింట్ కలెక్టర్ పదవిని కూడా రద్దు చేసింది.
ఈ పథకంలోని ఇతర సిబ్బందిని సైతం విధుల నుంచి విడుదల చేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారుల (FSO) పనిని ఆయా జిల్లాల రెవెన్యూ అదనపు కలెక్టర్లకు అప్పగించారు. దీంతో ఇకపై అదనపు కలెక్టర్లే ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
Advertisement
అటవీ భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించడానికి ముందు వచ్చే అభ్యంతరాలను, ఇతర అటవీ సమస్యలను ఇకపై అదనపు కలెక్టర్లే పరిష్కరించనున్నారు. సర్వే పూర్తయ్యే వరకు జిల్లా రెవెన్యూ, అటవీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
