మన పత్రిక, వెబ్డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( chandrababu naidu ) రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ( AP FAMILY CARD 2025 ) జారీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ చేరువ చేయడమే ఈ నిర్ణయం లక్ష్యం.
ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, వారు పొందుతున్న ప్రభుత్వ పథకాల సమాచారం కూడా ఉండనుంది. ఫ్యామిలీ కార్డు డిజైన్ కోసం ఆధార్ ఆధారంగా ఉపయోగించాలని చంద్రబాబు సూచించారు. పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలను రీ-డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ సులభతరం కానుంది. అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనాలు చేరుతాయని నిర్ధారించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
