Advertisement

మిజోరాంలో ‘యాచక నిషేధ బిల్లు’కు ఆమోదం

మన పత్రిక, వెబ్​డెస్క్ : మిజోరాం ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు-2025’ను ఆమోదించింది. ఇది కేవలం యాచకులను శిక్షించడం కాకుండా, వారికి సహాయం చేసి, పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం ‘రిలీఫ్ బోర్డు’ను ఏర్పాటు చేసి, యాచకులను తాత్కాలికంగా ఉంచడానికి ఒక ‘రిసీవింగ్ సెంటర్’ను ప్రారంభిస్తుంది. అనంతరం 24 గంటల్లో వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటారు.

అయితే, ఈ బిల్లును ప్రతిపక్షం వ్యతిరేకిస్తోంది. ఈ చట్టం రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు, క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని ప్రతిపక్ష నేత లాల్చందమ రాలే పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి లాల్దుహోమా మాట్లాడుతూ.. ఈ బిల్లు ఉద్దేశ్యం శిక్షించడం కాదని, వారికి సహాయం చేయడం ద్వారా మిజోరాంను యాచకులు లేని రాష్ట్రంగా మార్చడమే అని తెలిపారు.

Advertisement

Advertisement