Advertisement

పప్పులో కప్ప! మహబూబ్‌నగర్ స్కూల్ లంచ్ ఘటన

mahabubnagar News: మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని లాల్‌కోట ప్రభుత్వ హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో ఒక అసహ్యకర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు వడ్డించుకుంటుండగా పప్పులో ఒక కప్ప కనిపించింది. దీంతో పిల్లలు భయంతో భోజనం పడేసి, ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో మురళీకృష్ణ గురువారం స్కూల్‌కు చేరుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

స్కూల్ ఫుడ్ సేఫ్టీ ఏమయ్యిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement