BJP and BC Leaders : బీజేపీ ఆఫీసులోనే బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య కొట్లాట కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో ఫోటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతలు కొట్టుకున్నారు. ఈనెల 18న రాష్ట్ర బంద్కు మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావును కోరేందుకు ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు వెళ్లారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఫోటోలు దిగే విషయంలో నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీజేపీ, బీసీ సంఘం నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. కృష్ణయ్య, రాంచంద్రరావు వద్దని వారించినా కూడా వాళ్లు వినలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
