WhatsApp
Advertisement

Medaram : మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలించిన పొంగులేటి, సీతక్క

Medaram : తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఇవాళ మేడారంలో పర్యటించారు. ఈసందర్భంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. వచ్చే సంవత్సరం  ఫిబ్రవరి నెలలో మేడారం పెద్ద జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈసారి మేడారం జాతర ఏర్పాట్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ముందు నుంచే అభివృద్ధి పనులను చేపట్టింది.

అయితే.. మంత్రులు పొంగులేటి, సీతక్క మేడారం పర్యటనకు వచ్చినా, దేవాదాయ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ మాత్రం హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందని పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement