BTech Student Suicide : కాలేజీలో లెక్చరర్స్ చెప్పే పాఠాలు అర్థం కాక ఏం చేయాలో తెలియని ఓ యువతి చివరకు ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, గోపాల్ పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల కీర్తన హైదరాబాద్ లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఇటీవలే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది.
కానీ, కాలేజీలో లెక్చరర్స్ చెబుతున్న లెస్సన్స్ అర్థం కాక, తన కుటుంబ సభ్యులను వదిలి హైదరాబాద్ లో ఉండలేక డిప్రెషన్ కు గురైంది. తను కాలేజీలో ఉండలేకపోతున్నానని, చదువు ఏం అర్థం కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. వేరే కాలేజీలో చేరుతానని చెప్పింది. దీంతో తన తల్లిదండ్రులు కూడా సరే అన్నారు.
Advertisement
ఇటీవలే స్వగ్రామానికి తిరిగి వచ్చిన కీర్తన గత శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
