Advertisement

TG: ఏఐతో సీఎం చంద్రబాబు పేరుతో మోసం.. టీడీపీ నేతలకు టోకరా

Telangana: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫోన్ చేసినట్లుగా నమ్మించి గుర్తుతెలియని సైబర్ నేరగాడు తెలంగాణ టీడీపీ నాయకులను మోసగించాడు.

Advertisement

సత్తుపల్లికి చెందిన పలువురు టీడీపీ నేతలకు AI సాయంతో వీడియో కాల్స్ చేసి, రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికాడు. అనంతరం, వారి నుంచి ఫోన్‌పే ద్వారా కొంత నగదును వసూలు చేశాడు. ఈ ఘటనలో మోసపోయిన నేతలను తెలంగాణ నుంచి విజయవాడకు (వీజేఏ) రప్పించడం గమనార్హం. బాధితులు చివరికి మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement