Viral Video : తన తల్లిని కోపంలో కొట్టానని బాధతో హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన బీజేపీ నేత రెవెల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో తన తల్లిని రాజు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో వల్ల తన పరువు అంతా పోయిందని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసి రాజు బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తన తల్లి తనను మోసం చేయడం వల్లనే కోపంతో కొట్టాను. కానీ.. తప్పు జరిగింది. ఆ వీడియోను కూడా తన తల్లే తీసిందని ఆ వీడియో వైరల్ అవడం వల్ల తను ఇప్పుడు తలెత్తుకోలేకపోతున్నానని సెల్ఫీ వీడియోలో రాజు వాపోయాడు.
Advertisement
తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు రాజు భార్య ఫిర్యాదు చేయడంతో బీబీనగర్ చెరువులో రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
