Nobel Peace Prize : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు నోబెల్ ప్రైజ్ రాబోతోందని వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తీరా నోబెల్ పురస్కారాలు ప్రకటించిన తర్వాత చూస్తే ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని వెనుజులాకు చెందిన మహిళ మరియా కెరీనా మగాడూ దక్కించుకున్నారు.
ఆమె ఎవరో కాదు.. 2012 లో వెనుజులా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె వెనుజులా దేశ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె పోరాడినందుకు గాను మరియాకు ఈ పురస్కారం లభించింది.
ఈ పురస్కారం కోసం డొనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నాలు లేవు. కానీ, చివరకు ఆయనకు మాత్రం పురస్కారం దక్కలేదు. దీంతో ఈ సంవత్సరం కూడా ఆయన చిరకాల కోరిక అయిన నోబెల్ శాంతి పురస్కారం పొందలేకపోయారు. ఇక.. మరియాకు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి అయిన డిసెంబర్ 10వ తేదీన ప్రైజ్ ప్రదానం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
