మన పత్రిక, వెబ్డెస్క్ : సిద్దిపేట ( SIDDIPET ) జిల్లా దుబ్బాక ( DUBBAKA ) నియోజకవర్గంలోని అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. పోతరెడ్డిపేట పెద్ద చెరువు నుంచి మత్తడి ప్రవాహం భారీగా వస్తోంది. చిన్న నిజాంపేట వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులు అకస్మాత్తుగా వరద నీటిలో చిక్కుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో రైతుల వద్దకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. అయినప్పటికీ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రైతులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, తహశీల్దార్ మల్లికార్జున్, సిఐ శ్రీనివాస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
