Telangana: ఉమ్మడి రంగారెడ్డి (RR), హైదరాబాద్ (HYD) జిల్లాల్లో చదువు మానేసిన విద్యార్థులకు శుభవార్త. ఓపెన్ ఎస్సెస్సీ (SSC), ఇంటర్ (INTER) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ అధికారులు గురువారం తెలిపారు. విద్యార్థులు ఫైన్ లేకుండా ఈనెల 13వ తేదీలోగా, అలాగే ఫైన్తో ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గలవారు www.telanganaopenschool.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఇవి కూడా చదవండి :
Advertisement
