జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో సమావేశం.
kothagudem news today: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరచడంలో పాత్రికేయులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని . రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఎలా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయో సమగ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని, ప్రజల సమస్యలను నిబద్ధతతో వెలుగులోకి తేవాలని ఆయన అన్నారు..ఈ సమావేశంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు గోపి, సతీష్, బరిగెల భూపేష్, మనోజ్, బాలకృష్ణ, దుర్గాప్రసాద్, రబ్బానీ, రిషి, పాల్గుణ, శ్రీమన్నారాయణ, వాసు, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
