తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ హైస్కూళ్లలో 1,803 మంది పీఈటీలు (Physical Education Teachers) అవసరమని గుర్తించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
రాష్ట్రంలో 4,701 హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,803 చోట్ల పీఈటీలు లేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రాధమిక పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఎస్జీటీ పోస్టులను తగ్గించి, ఆ మేరకు కొత్తగా 1,803 పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు సూచించారు.
Advertisement
అదే సమయంలో, 260 హైస్కూళ్లకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఇవ్వలేదు. వాటికి కూడా ఎస్జీటీ పోస్టులను తగ్గించి, హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
