PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాయలసీమలో మోదీ పర్యటన ఉండనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన ఉండనుంది.
16 వ తేదీన కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా పాల్గొంటారు. సభ అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
