మన పత్రిక, వెబ్డెస్క్
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన వేడుకలు నేడు సద్దుల బతుకమ్మతో ముగిశాయి.
Advertisement
ఈ రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు, పసుపు గౌరమ్మ, ఐదు రకాల నైవేద్యాలతో విశేషంగా జరుపుకుంటారు. రాగి పల్లెంలో కుంకుమ, పసుపు, గునుగు, బంతిపూలు లాంటి రంగులతో త్రికోణంగా అలంకరిస్తారు. కొందరు నిలువెత్తు బతుకమ్మలు, కాగితాలతో కూడా తయారు చేస్తారు.
సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేసి, బతుకమ్మ, గౌరమ్మ, నైవేద్యాలను ఉంచి, మహిళలు చుట్టూ ఆడి పాడతారు. చివరికి చెరువులో నిమజ్జనం చేసి, నైవేద్యాలు పంచుకుంటారు. పుట్టింటికి వచ్చిన అమ్మాయిలు, కన్నవారితో కలిసి ఆనందం పంచుకుంటారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
