Advertisement

హైదరాబాద్-కామారెడ్డి మధ్య రైల్వే సర్వీసులు నిలిచిపోయాయి

మన పత్రిక, వెబ్​డెస్క్ : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి మార్గంలో రైల్వే రాకపోకలు గందరగోళంగా మారాయి. రెండు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లు రద్దయ్యాయి.

Hyderabad to kamareddy trains rain news today

మరో నాలుగు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. పట్టాలపై నీరు నిల్వ ఉండటంతో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రవాణాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిపై అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి మరింత దిగువకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement