Advertisement

ఎంజీబీఎస్‌కు రావొద్దు

mgbs rain today : భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో వరద స్థాయి పెరిగింది. దీంతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. ప్రయాణికులు ఎంజీబీఎస్‌కు రావొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజా సమాచారం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సుల నిర్వహణ ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మార్గాల్లో సర్వీసులు జేబీఎస్ నుంచి అందుబాటులో ఉన్నాయి. వరంగల్, హనుమకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి నడుస్తున్నాయి. ప్రయాణికులు ఈ సమాచారం దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement