రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 30 అడుగుల వద్ద ఉండగా, క్రమంగా పెరుగుతూ ఇవాళ ఉదయానికే 40 అడుగులకు చేరింది. మధ్యాహ్నం లోపు 43 అడుగులకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. నదిలో స్నానాలు చేయడం అత్యంత ప్రమాదకరం అని అధికారులు హెచ్చరించారు.
భక్తులు స్నానఘట్టాలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే భద్రమైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాద హెచ్చరికలు మరింత దశల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
