మన పత్రిక, వెబ్డెస్క్
ప్రస్తుతం నెల 1–15 మధ్య ఉదయం 8–12, సాయంత్రం 4–8 గంటలకు రేషన్ పంపిణీ జరుగుతుంది. కొన్ని డీలర్లు సమయానికి తెరవడం లేదని, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోజంతా (సుమారు 12 గంటలు) రేషన్ షాపులు ఓపెన్ ఉంచాలని నిర్ణయం.
ఈ విధానాన్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాల్లో ప్రారంభించనున్నారు. ప్రతి నగరంలో 15 చొప్పున మొత్తం 75 రేషన్ షాపులను ఎంపిక చేస్తారు.
ఈ షాపులను “మినీ మాల్స్” ( AP Mini Malls ) గా మార్చనున్నారు. ఇక్కడ రేషన్ వస్తువులతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. NACTAR, గిరిజన కార్పొరేషన్ ద్వారా సరుకులు సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
సరుకులను ప్రభుత్వమే కొంటుందా లేదా డీలర్లే కొంటారా? రేషన్ కార్డుదారులకు రాయితీ ఉంటుందా? లేదా మార్కెట్ ధరలకే అమ్ముతారా? – ఇంకా స్పష్టత రావాలి.ఈ వారంలోపే షాపుల ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
