మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ హైకోర్టు సాదాబైనామా భూముల నమోదుపై విధించిన స్టేను తొలగించింది. ఈ తీర్పు లక్షలాది మంది పేదల కలలకు సాకారం చేసే అవకాశం కలిపింది.
Sadabainama Telangana latest News
పూర్వపు ప్రభుత్వం 9.26 లక్షల దరఖాస్తులు స్వీకరించినా, 2020 ఆర్ఓఆర్ చట్టంలో వాటి పరిష్కారానికి మార్గం చూపలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో హైకోర్టులో పోరాడిందని, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలు తీసుకురావడమే విజయానికి కారణమని తెలిపారు. భూభారతి ( Bhu bharati ) సదస్సుల ద్వారా 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ప్రతి ఒక్కటి పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హామీ ఇచ్చారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
