మన పత్రిక, వెబ్డెస్క్
Telangana News : తెలంగాణ రైతు ఈసారి చరిత్ర సృష్టిస్తున్నాడు. కాళేశ్వరం ( Kaleshwaram ) మెడలు విరిగినా, బరాజ్లు పనికిరాకుండా ఉన్నా… 67 లక్షల ఎకరాల్లో వరి సాగుతో కొత్త రికార్డు నమోదు చేశాడు. సాధారణంగా 56 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుంది. కానీ ఈసారి 11 లక్షల ఎకరాలు అదనం. మొత్తం సాగు 1.32 కోట్ల ఎకరాలను దాటింది. ఈ పెరుగుదల కాళేశ్వరం వల్ల కాదు. ప్రాజెక్టు ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాలేదు. అయినా రైతు ముందుకు సాగుతున్నాడు.
బీఆర్ఎస్ నేతలు చెప్పే 15 లక్షల ఎకరాల వరి సాగు గణాంకం తప్పు. 2013-14లోనే 50 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండేది. రేవంత్ ప్రభుత్వం సన్నబియ్యానికి బోనస్ ధర ఇస్తోంది. రేషన్ లో సన్నబియ్యం ఇవ్వడంతో డిమాండ్ పెరిగింది. ఫలితంగా రైతులు సన్నాల సాగు పెంచుతున్నారు. మార్కెట్ ధరలు కూడా తగ్గాయి. వరి, మొక్కజొన్న సాగు పెరిగింది. కానీ పత్తి, చిరుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. యూరియా సరఫరాలో కేంద్రం సహకరించాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
