మన పత్రిక, వెబ్డెస్క్
Telangana News : తెలంగాణ రైతు ఈసారి చరిత్ర సృష్టిస్తున్నాడు. కాళేశ్వరం ( Kaleshwaram ) మెడలు విరిగినా, బరాజ్లు పనికిరాకుండా ఉన్నా… 67 లక్షల ఎకరాల్లో వరి సాగుతో కొత్త రికార్డు నమోదు చేశాడు. సాధారణంగా 56 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉంటుంది. కానీ ఈసారి 11 లక్షల ఎకరాలు అదనం. మొత్తం సాగు 1.32 కోట్ల ఎకరాలను దాటింది. ఈ పెరుగుదల కాళేశ్వరం వల్ల కాదు. ప్రాజెక్టు ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాలేదు. అయినా రైతు ముందుకు సాగుతున్నాడు.
బీఆర్ఎస్ నేతలు చెప్పే 15 లక్షల ఎకరాల వరి సాగు గణాంకం తప్పు. 2013-14లోనే 50 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండేది. రేవంత్ ప్రభుత్వం సన్నబియ్యానికి బోనస్ ధర ఇస్తోంది. రేషన్ లో సన్నబియ్యం ఇవ్వడంతో డిమాండ్ పెరిగింది. ఫలితంగా రైతులు సన్నాల సాగు పెంచుతున్నారు. మార్కెట్ ధరలు కూడా తగ్గాయి. వరి, మొక్కజొన్న సాగు పెరిగింది. కానీ పత్తి, చిరుధాన్యాలు, నూనెగింజల సాగు తగ్గుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. యూరియా సరఫరాలో కేంద్రం సహకరించాలి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
