Advertisement

ఆర్మూర్ లో స్వదేశీ జాగరణ: బీజేపీ నాయకుల ప్రకటన!

Armoor News : ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్లు రెడ్డి ప్రకాష్, గుర్రం వెంకటరమణ ప్రత్యక్షంగా పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు. మనం తయారు చేసిన వస్తువులు మనం వాడుకుంటే దేశం అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం ‘వికసిత్ భారత్’ సాధ్యమవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

స్వదేశీ జాగరణ మంచ్ ప్రచారంలో భాగంగా ఈ కరపత్రాలు ప్రజలకు అందించనున్నారు. దేశీయ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించారు. బీజేపీ నాయకులు కలిగోట ప్రశాంత్, పిట్ల శ్రీధర్, తోట నారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారస్థులు సత్య శ్రీనివాస్, గజవాడ రాజయ్య, పడిగేల్ శ్రీనివాస్ గుప్తా సహా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

ఈ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఆర్మూర్ పట్టణంలో స్వదేశీ ఉద్యమానికి పునాది పడింది.

Advertisement