Ap dsc 2025 appointment letters : రాష్ట్రంలో మెగా డీఎస్సీ ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త. గతంలో అనుకున్నట్టుగా వర్షాలు ఆటంకం కలిగించడంతో వాయిదా పడిన నియామక పత్రాల పంపిణీ ఇప్పుడు ఈ నెల 25న అమరావతిలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు తన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ మొదటి ఫైల్పై సంతకం చేసి డీఎస్సీ ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్-జూలైలో పరీక్షలు నిర్వహించి, ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు.
ఇప్పుడు, నియామక పత్రాలు అందుకున్న వెంటనే వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దసరా సెలవుల సమయంలోనే ఈ శిక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దసరా సెలవులు అక్టోబర్ 2న ముగియనుండగా, అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అప్పటికి కొత్తగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే, ఈ నెల 25న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. వై.సి.పి. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించకపోగా, చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
ఇవి కూడా చదవండి :
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
