CM Review on Telangana Education Policy today | తెలంగాణ విద్యా విధానం (TEP) రూపకల్పనపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారు డా. కేశవరావు అధ్యక్షత వహిస్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, విద్యాశాఖ కార్యదర్శి డా. యోగిత రాణా (కన్వీనర్), టిజీహెక్ చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ జాతీయ విద్యా విధానం 2020 ను తెలంగాణ సందర్భానుసారంగా సవరించి పరిశీలించనుంది. కొత్త ఉద్యోగావకాశాలు, నైపుణ్యాలు, ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చడంపై దృష్టి పెట్టనుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్ అంశాలపై కూడా సిఫార్సులు చేయనుంది.
పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తి, నైపుణ్య విద్యా రంగాల్లో సమగ్ర సంస్కరణలు, పరిశోధన, పరిశ్రమలతో విద్యా రంగాన్ని అనుసంధానం చేయడంపై కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ నివేదికను 2025 అక్టోబర్ 30లోపు ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
