Telangana Colleges Bandh fathi : తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేట్స్ ఫెడరేషన్ (FATHI) ప్రకటన రాష్ట్ర విద్యారంగానికి పెద్ద ఎదురుదెబ్బ. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల చేయకపోవడంతో, ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంతో ఈ నెల 15 నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మా, ఎంబీఏ, బీఈడీ కాలేజీలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు FATHI ప్రకటించింది. ఈ నిర్ణయం దేశంలో తొలిసారి తీసుకున్నదని FATHI పేర్కొంది. గత కొన్ని నెలలుగా కాలేజీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల్లో ప్రభుత్వానికి చెందిన వాటాను ఇంకా చెల్లించలేదు.
ఈ బకాయిల కారణంగా స్టాఫ్ జీతాలు, ఇతర ఖర్చులు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ అత్యవసర నిర్ణయం తీసుకున్నట్లు FATHI తెలిపింది. ఈ నిరవధిక సమ్మె ఫలితంగా సోమవారం నుంచి విద్యార్థుల తరగతులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. పరీక్షలు, ప్రాక్టికల్స్, ఇంటర్న్ షిప్స్ కూడా ప్రభావితం కానున్నాయి.
FATHI చేసిన ప్రకటన రాష్ట్ర విద్యా వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపనుంది. ప్రభుత్వం త్వరితగతిన జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
