Advertisement

ఏపీ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీలో పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా హక్కు చట్టం (RTE) కింద ఒకటో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన లాటరీలో మొత్తం 11,702 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31లోపు ఆయా పాఠశాలల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. ఎంపికైన విద్యార్థుల వివరాలు తల్లిదండ్రుల మొబైల్‌కు SMS ద్వారా పంపించడంతో పాటు, సంబంధిత వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement