మన పత్రిక: నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ అధ్యక్షుడు, సీఈవో లక్ష్ గోపిశెట్టి గల్లంతయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన ఆయన, వరదల ఉధృతి పెరిగినప్పటి నుంచి ఎవరికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు, క్షేమంగా గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై స్పందించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం, లక్ష్ గోపిశెట్టి భద్రతకే తమ మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేసింది. ఆయన ఆచూకీ తెలిపేందుకు సంబంధిత అధికార యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఆయన కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడుతున్నామని, ఈ క్లిష్ట సమయంలో వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపింది.
అమెరికా, కెనడా దేశాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలకు సాంకేతిక, డిజిటల్ సేవలు అందించే ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్కు లక్ష్ గోపిశెట్టి నాయకత్వం వహిస్తున్నారు. నేపాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. పలువురు విదేశీయులతో పాటు భారతీయులు కూడా ఈ ప్రాకృతిక విపత్తులో చిక్కుకున్నారు.
నేపాల్లో చిక్కుకున్న భారత పౌరులను ఆదుకునేందుకు, రక్షణ చర్యలు చేపట్లేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేపాల్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
