మన పత్రిక: శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగను 2026లో ఆగస్టు 28న శుక్రవారం రోజున నిర్వహించనున్నారు. డ్రిక్ పంచాంగ్ ఆధారంగా పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది.
హిందూ పండుగల సమయాలు స్థానిక సూర్యోదయం మరియు పంచాంగ అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల నగరాలను బట్టి రాఖీ కట్టే శుభ ముహూర్తాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఢిల్లీలో ఆగస్టు 28న ఉదయం 5:57 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు అనుకూల సమయంగా ఉంది. అక్కడ భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగియనుంది. ముంబైలో ఆగస్టు 28 ఉదయం 6:22 గంటల నుంచి ఉదయం 9:48 గంటల వరకు ముహూర్తం ఉనట్లు పంచాంగం ద్వారా తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో నివసించే వారు తమ స్థానిక పంచాంగాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
పూజా విధానం మరియు సంప్రదాయాలు
రక్షాబంధన్ రోజున పూజ థాలీలో రాఖీ, రోలీ లేదా కుంకుమ, అక్షతలు, దీపం, మిఠాయిలు సిద్ధం చేసుకుంటారు. పండుగ క్రతువులో భాగంగా సోదరుడికి నుదుటిపై కుంకుమ తిలకం దిద్ది, అక్షతలు చల్లుతారు. అనంతరం హారతి ఇచ్చి సోదరుడి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.
తర్వాత సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపిస్తారు. సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బహుమతులు అందజేస్తారు. కుటుంబ ఆచారాలు, ప్రాంతీయ పద్ధతులను బట్టి ఈ వేడుకల నిర్వహణలో కొన్ని మార్పులు ఉంటాయి.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
