Advertisement

రామాయణ 2 తర్వాతే బ్రహ్మాస్త్ర 2 ప్రారంభం

మన పత్రిక: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ రాబోయే చిత్రాల జాబితాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు భాగాల చిత్రీకరణ పూర్తయిన వెంటనే రణ్‌బీర్ ‘బ్రహ్మాస్త్ర 2’ పనులను ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం.

దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రస్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్, ప్రి-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం ‘బ్రహ్మాస్త్ర 2’ చిత్రీకరణను 2027 ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సీక్వెల్‌లో రణ్‌బీర్ కపూర్ శివ, దేవ్ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.

Advertisement

ఈ చిత్రంలో ఆలియా భట్ మళ్లీ ఈషా పాత్రలో కనిపించే అవకాశం ఉంది. అలాగే అమృత పాత్ర కోసం నటి దీపికా పదుకొణెతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామాయణ, బ్రహ్మాస్త్ర 2 మాత్రమే కాకుండా రణ్‌బీర్ కపూర్ చేతిలో ‘లవ్ అండ్ వార్’, ‘యాకేటగిరీ పార్క్’ (Animal Park) వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

Advertisement