Advertisement

సెప్టెంబర్ 15న ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్: మంత్రి నారా లోకేశ్

మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ కేలండర్-2026 ద్వారా చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ அதிகாரులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీలో ఎలాంటి చట్టపరమైన లేదా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 10,060 పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.

రెండో దశ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త తేదీలను మంత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 15వ తేదీన 3,168 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మూడు, నాలుగో దశల్లో భర్తీ చేయాల్సిన 5,369 పోస్టులకు సంబంధించి అక్టోబర్ 15న అధికారిక ప్రకటన జారీ చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నియామక ప్రక్రియలన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

Advertisement
Advertisement