Advertisement

హైదరాబాద్ పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

మన పత్రిక, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి లొకేషన్‌ను మిర్యాలగూడ సమీపంలో ట్రేస్ చేసి, అక్కడ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం అత్తాపూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఉదయ్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన వెల్లడించారు.

Advertisement
Advertisement