Advertisement

సింహాచలంలో వైభవంగా గిరిప్రదక్షిణ పోటెత్తిన భక్తజనం

మన పత్రిక, విశాఖపట్నం: సింహాచలంలో గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి నామస్మరణతో 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండిపోయింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఈ ఏడాద గిరిప్రదక్షిణలో 10 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భద్రత కోసం పోలీసులు డ్రోన్ల ద్వారా ప్రదక్షిణ మార్గాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మంచినీటి పంపిణీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement