Advertisement

వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

మన పత్రిక: వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న ఎమ్మెల్యే Bonda Uma తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం, బొండా ఉమ నుంచి వివరణ తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ అంశంపై బొండా ఉమ నుంచి వివరణ తీసుకునే బాధ్యతలను పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడులకు సీఎం చంద్రబాబు అప్పగించారు. దీంతో పాటు వైసీపీ నేతలతో ఎవరూ వేదికలను పంచుకోవద్దని పార్టీ నేతలకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement