మన పత్రిక: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏడాది నాటికి పక్కా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara Lokesh తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇప్పటికే 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని ఆయన తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అలాగే మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని నారా లోకేశ్ వివరించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- యువత భవిష్యత్తే ప్రధాని మోదీకి ముఖ్యమని పీవీఎన్ మాధవ్ వెల్లడి
- జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్
- జూలై 25న స్టాక్ మార్కెట్లకు శనివారం సెలవు
- తెలంగాణ ఉన్నత విద్యలో తగ్గిన ఉపాధ్యాయుల సంఖ్య: ఏఐఎస్హెచ్ఈ నివేదిక
- రంపచోడవరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన చంద్రబాబు, లోకేశ్
