Advertisement

తెలంగాణలో విద్యాసంస్థల బంద్ ప్రశాంతం

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో NEET Row నేపథ్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ శుక్రవారం కొనసాగింది. నీట్-యుజి పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలకు నిరసనగా ఈ బంద్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యాసంస్థల బంద్ పాటించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ సంఘాలు పిలుపునిచ్చాయి.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ వరకు విద్యార్థి సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఈ బంద్ కారణంగా ఓస్మానియా యూనివర్సిటీ జూలై 24న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

కాంగ్రెస్, బీఆర్ఎస్ నిరసనలు

నీట్ పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా నిరసనలు ప్రకటించాయి. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

Advertisement